యాప్నగరం

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 Sep 2022, 5:05 pm
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తెలుగు దేశం పార్టీ సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న చంద్రబాబు


ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన కలిశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ బిశ్వభూషణ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను చంద్రబాబు కలిసి ఫిర్యాదు చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.