యాప్నగరం

ఇది దుర్మార్గం, బ్లాక్ డే.. కాలినడకన బయల్దేరిన చంద్రబాబు

Chandrababu Naidu జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అమరావతిని తరలించానే నిర్ణయం బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. టీడీపీ నేతలతో కాలినడకన అసెంబ్లీ వైపు బయల్దేరారు.

Samayam Telugu 20 Jan 2020, 12:37 pm
మరావతిని తరలించాలనే నిర్ణయం చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిర్ణయం తీసుకుందని.. చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదని ధ్వజమెత్తారు. ఇది పిరికిపందల చర్య అని.. వైఎస్సార్‌సీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని వ్యాఖ్యానించారు. అమరావతి, ఏపీ రాజధాని అంశంపై జగన్ కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోమవారం (జనవరి 20) ఉదయం ఆయన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu chandra


హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానిని అమరావతికి తరలించినప్పుడు కూడా ఈ స్థాయిలో బందోబస్తు పెట్టలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని.. ఇది 5 కోట్ల ప్రజల మనోభావం అని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ కేబినెట్ నిర్ణయంతో అమరావతి ఉద్రిక్తం

రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కాలినడకన అసెంబ్లీకి బయల్దేరారు. భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

Must Read: కుర్రాడి దెబ్బ.. చంద్రబాబు అడుక్కు తింటున్నారు: రోజా

ఏపీ క్యాబినెట్ నిర్ణయం తర్వాత తుళ్లూరు, వెలగపూడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడేపల్లి నుంచి ఏపీ అసెంబ్లీ వరకు 30 కి.మీ. మేర వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు. గుంటూరు, విజయవాడలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్బంధాన్ని చేధించుకుంటూ రైతులు, మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
See Photo Story: అమరావతి ఉద్రిక్తం: వెల్లువెత్తిన నిరసనలు- అసెంబ్లీ ముట్టడికి రైతుల యత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.