టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు కాంస్య పతకం సాధించడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి.. పీవీ సింధు రికార్డులకెక్కారు. పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పీవీ సింధుకు ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా పీవీ సింధుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచారని పీవీ సింధును అభినందించారు. సింధూ పోరాట పటిమ దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన పీవీ సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని చంద్రబాబు కొనియాడారు. సింధు సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పీవీ సింధుకు ఫోన్లో చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక, సోషల్ మీడియా వేదికగా పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా పీవీ సింధుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచారని పీవీ సింధును అభినందించారు. సింధూ పోరాట పటిమ దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన పీవీ సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని చంద్రబాబు కొనియాడారు. సింధు సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పీవీ సింధుకు ఫోన్లో చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక, సోషల్ మీడియా వేదికగా పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.