యాప్నగరం

TDP: ఆ 19మందికి మాత్రమే టికెట్లు, ఆ ప్రకటనతో సంబంధం లేదన్న టీడీపీ.. నేతలపై చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu పార్టీ ఇంఛార్జ్‌లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 59మందితో రివ్యూ చేశారు. ఇంటర్నల్ రిపోర్ట్స్‌ తెప్పించుకుని నేతల పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, సమర్థవంతంగా పనిచేయని నేతలతో ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ అధినేత ప్రశ్నిస్తున్నారు. పనితీరు సరిగా లేని నేతలు మారాలని.. నియోజకవర్గంలో అందిరినీ కలుపుకుని ముందుకు సాగాలిని సూచిస్తున్నారు. 19మంది సిట్టింగ్‌లకు మాత్రం టికెట్లు ఖరారు చేశారని.. మిగిలిన వారి విషయంలో అధికారిక ప్రకటన చేయలేదంటున్న టీడీపీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 24 Sep 2022, 6:14 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Naidu Review With Party In Charges
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో వరుసగా సమీక్షలు చేస్తున్నారు. నేతల పనితీరుపై రివ్యూ చేస్తున్నారు.. పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్ట్స్ ఆధారంగా బాగా పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లను చంద్రబాబు అభినందిస్తున్నారు. సమర్థవంతంగా లేని వారిని మీరు ఎన్నికలు సిద్దంగా ఉన్నారా.. ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమం నుంచి బాదుడే బాదుడు వరకు అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నారు. నేతల పనితీరుపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని సమీక్షల సమయంలో బయటకు తీసి సమీక్ష చేస్తున్నారు.
సమగ్రమైన, లోతైన నివేదికలతో నేతలను చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు స్థానిక సమస్యలపై, ప్రత్యర్థి నేతలపై పోరాటాల విషయంలో కూడా ఇంఛార్జ్‌లతో సమీక్ష చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గాలేని వారు పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంఛార్జ్‌గా ఉన్నవారు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని.. ఏకపక్షంగా ఉంటే ఉపేక్షించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందని.. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని నేతలకు చంద్రబాబు తేల్చి చెబుతున్నారు.

ఇంఛార్జ్‌లు, నేతల్లో సీరియస్‌నెస్ పెరగాలని.. పార్టీ కార్యక్రమాల్లో ఇంకా చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి, వైఫల్యాలపై బలంగా పోరాడాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రతి ప్రజా సమస్యపైనా పనిచేయాలి అన్నారు. తనకు నేతల పనితీరే ప్రామాణికమని.. గెలుస్తారన్న నమ్మకం కలిగిస్తే టికెట్‌ ఇస్తాను అన్నారు. లేని పక్షంలో పునరాలోచన చేయాల్సి వస్తుంది అన్నారు.

చంద్రబాబు సమీక్షల్లో టికెట్ల ఖరారు అంశమే చర్చకు రావడం లేదని.. కానీ కొందరు తమకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే చంద్రబాబు అధికారిక నిర్ణయం ప్రకటించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంఛార్జ్‌ల విషయంలో అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని.. వారి పనితీరు బాగుంటే వారికే టికెట్‌ వస్తుంది. బాగోకపోతే రాదు అంటున్నారు.

ఆశించిన స్ధాయిలో పనితీరు చూపించలేకపోతున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో వర్గ విభేదాలు, స్ధానిక సమస్యలపై పోరాటాలు, ప్రత్యర్థి నేతల తప్పులను ఎత్తిచూపడం వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ సమీక్షలను నేతలు అంతా సీరియస్‌గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని.. అంతిమంగా పనితీరే ప్రామాణికం అని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ సమీక్షలలో ఇప్పటివరకు 59 నియోజకవర్గాల్లో ముఖాముఖీ భేటీలు ముగిశాయి. తాజాగా రాజమండ్రి సిటీ, పెద్దాపురం, రాజాం నియోజవర్గాల ఇంఛార్జ్‌లు ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, కొండ్రు మురళిలతో సమీక్ష చేశారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.