యాప్నగరం

రూ. 77 వేలు ఎగ్గొట్టారు, రైతు భరోసా బోగస్.. టీడీపీ వస్తే ఒక్కో రైతుకు రూ. 1.15 లక్షలు: చంద్రబాబు

YSR Rythu Bharosa పథకంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 27 Oct 2020, 7:07 pm
వైఎస్సార్ రైతు భరోసా బోగస్ పథకమని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Samayam Telugu పొలం దున్నుతున్న చంద్రబాబు (ఫైల్ ఫొటో)


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రైతు భరోసా’ పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది రూ. 37,500 మాత్రమే అని పేర్కొన్నారు. అదే టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 కిస్తీల కింద ఒక్కో రైతుకు రూ. 1.15 లక్షలు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో రైతుకు రూ.77 వేలకు పైగా ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా ప్రకటనలు ఇచ్చుకోవడం రైతులకు నమ్మక ద్రోహం చేయడమేనని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ.4 వేల కోట్లు ఇస్తామంటూ రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రూ. 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.