యాప్నగరం

వైఎస్ మేలు చేశారు.. కానీ రెండేళ్లలోనే.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహా మాజీ సీఎంలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మాదిరి ఎవరూ చేయలేదని.. విధ్వంసాలకు పునాది పడి రెండేళ్లు అవుతుందంటూ ప్రజావేదికను గుర్తు చేశారు.

Samayam Telugu 25 Jun 2021, 5:27 pm
జగన్ సర్కార్‌ విధానాలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేసే ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసాలకు పునాది వేసి నేటితో రెండేళ్లు గడిచాయని చంద్రబాబు విమర్శించారు. ప్రజావేదికను కూల్చి తన పాలనా స్వభావాన్ని తెలియజెప్పాదని.. కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటీ లేదని ఎద్దేవా చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ysr


జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని ఆయన అన్నారు. ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, హక్కులను కూడా కాల రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ రాష్ట్రానికి ఎంతోకొంత మేలు చేశారని.. జగన్ మాదిరిగా ఎవరూ తిరోగమనం బాట పట్టించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రెండేళ్లలోనే పరిస్థితులు ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో రాష్ట్రం ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.