యాప్నగరం

సీఎం జగన్ బాటలోనే చంద్రబాబు.. మొత్తానికి జై కొట్టారు!

Chandrababu Tweet On New Parliament టీడీపీ కూడా అధికార పార్టీ బాటలో నడుస్తోంది. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన అధినేత చంద్రబాబు. పేదల కోసం చేసే పాలసీలకు నూతన పార్లమెంట్ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఆర్థిక అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దేలా నిర్ణయాలు ఉండాలన్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఈ కార్యక్రమానికి వెళుతున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 May 2023, 1:49 pm

ప్రధానాంశాలు:

  • వైసీపీ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు
  • మొత్తానికి జై కొట్టి నేరుగా మద్దతు ప్రకటించారు
  • ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu
ప్రతిపక్షాలు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి.. 19 పార్టీలు ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీల నిర్ణయంపై ఉత్కంఠరేపింది. ఏపీ విషయానికి వస్తే.. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీఎం జగన్ బాటలో నడుస్తున్నారు.. ఈ ప్రారంభోత్సవానికి టీడీపీ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి నూతన పార్లమెంట్ భవన ప్రారంభంపై శుభాకాంక్షలు తెలిపారు. పేదరిక నిర్మూలనకు అవసరం అయ్యే పాలసీల రూపకల్పనకు ఈ పార్లమెంట్ వేదిక కావాలని ఆకాంక్షించారు చంద్రబాబు. భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దేలా పార్లమెంట్ లో నిర్ణయాలు జరగాలన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం తరపున ఆ పార్టీ ఎంపీలు కార్యక్రమానికి హాజరు కానున్నారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం జరగనున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సీఎం పాల్గొంటారు. అలాగే పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభ వేడుకలకు సీఎం జగన్‌ హాజరవుతారు. సీఎం జగన్ హస్తిన పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో పాటూ పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. కేంద్రమంత్రి సీతారామన్‌ను కలిసి.. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా ఇటీవలే రాష్ట్రానికి రూ.10,460.87 కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలుపనున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.