యాప్నగరం

Chandrababu Naiduకు షాకిచ్చిన విశాఖ పోలీసులు

అమరావతి నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు. బైక్ ర్యాలీకి ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్లు.. అడ్డుకున్న పోలీసులు. టీడీపీ నేతలు-పోలీసులు మధ్య వాగ్వాదం. రెండు రోజుల పాటూ విశాఖలోనే చంద్రబాబు పర్యటన.

Samayam Telugu 10 Oct 2019, 11:36 am
టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత చంద్రబాబు. గురువారం నుంచి మళ్లీ జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. విశాఖ నుంచి సమీక్షలకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల పర్యటన కోసం బాబు విశాఖ పర్యటనకు చేరుకున్నారు. అమరావతి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న టీడీపీ అధినేతకు నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత బయటకు వచ్చిన బాబుకు విశాఖ పోలీసులు షాకిచ్చారు. తమ అధినేత రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బైక్ ర్యాలీకి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Samayam Telugu babu


చంద్రబాబుతో పాటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా.. కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఏడీ జంక్షన్‌కు కాన్వాయ్‌ను పంపించి.. కార్యకర్తల్ని, నేతల్ని ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి పంపేశారు. పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్ల నిరుత్సాహపడ్డారు. ఎలాంటి హడావిడి లేకుండానే చంద్రబాబు కాన్వాయ్ నగరానికి చేరుకుంది. చంద్రబాబు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

గురు, శుక్రవారాల్లో చంద్రబాబు విశాఖలోనే సమీక్షలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. విశాఖ జిల్లా పర్యటనను పూర్తి చేసుకొని ఈ నెల 14, 15న నెల్లూరు జిల్లాకు వెళతారు. తర్వాత ఈ నెల 21, 22న శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ రెండు రోజుల పాటూ సమీక్షలు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.