యాప్నగరం

'అమరావతి మహిళలు గుడికి వెళ్లకుండా.. మీలా కోర్టుకు వెళ్లమంటారా'

'గుడికి వెళుతున్న మహిళల్ని అడ్డుకోవడం ఏంటి.. దేవుడ్ని పూజించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా' అంటూ ఏపీ సీఎం జగన్‌పై మండిపడిన మండిపడిన టీడీపీ అధినేత చంద్రబాబు.

Samayam Telugu 10 Jan 2020, 2:59 pm
అమరావతిలో శుక్రవారం ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రాజధాని గ్రామాల మహిళలు, రైతులు విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉదయం పాదయాత్రగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగింది.. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అందర్ని చెదరగొట్టారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు మహిళలకు గాయాలు అయ్యాయి. అలాగే పలువురు రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
Samayam Telugu naidu


ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మహిళలపై లాఠీఛార్జ్ చేయడంపై విరుచుకుపడ్డారు.. ఘాటుగా ట్వీట్ చేశారు. గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి.. వాళ్ళ గ్రామ దేవతలని పూజించుకోడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు శుక్రవారం గుడికి వెళ్ళకపోతే మీలాగా కోర్టుకు వెళ్ళమంటారా అంటూ సెటైర్లు పేల్చారు. రైతులు గుడికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టుచేస్తారా.. ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఇటు లోకేష్ కూడా ఘటనపై ట్వీట్ చేశఆరు. అక్కాచెల్లీ అంటూ పాదయాత్రలో జగన్ పలకరించారని.. ఇప్పుడు అదే అక్కాచెల్లీ కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కితే ఎందుకు పారిపోతున్నారన్నారు. అన్యాయంగా మహిళలపై చేయి చేసుకుంటారా.. ఒక్కో ఇంటి దగ్గర పది మంది పోలీసులా.. మహిళల్ని అరెస్ట్ చెయ్యడానికి జగన్ గారికి సిగ్గుగా లేదా అంటూ మండిపడ్డారు. ఇళ్ల ముందు టెంట్ పట్టుకొని పోలీసులు నిలబడతారా.. టెంట్ వేసుకొనే హక్కు రైతులకు లేదా అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు అంటే జగన్ గారికి అంత చులకనా.. ఎంత మంది పోలీసులను దింపినా ప్రజాగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చవిచూడక తప్పదు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.