యాప్నగరం

YS Jagan రెడ్డి మార్క్ రాజకీయం ఇది.. డబ్బుల బాదుడే బాదుడు: టీడీపీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంగళవారం టీడీపీ సంచలన ట్వీట్లు చేసింది.

Samayam Telugu 7 Dec 2021, 8:10 pm
జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చిన నేపథ్యంలో ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసింది. ఇదీ జగన్ రెడ్డి మార్క్ రాజకీయం అంటూ విరుచుకుపడింది. ఓటీఎస్‌తో బాదుడు నేరుగా ఇంటి గుమ్మం తట్టిందని.. నేడు లేఔట్లలోకి వచ్చారని విమర్శించింది. ఈ బాదుడేంటని ప్రశ్నించకుండా ఇచ్చిన భూమి పేదలకి వాడతామని నాటకం మొదలుపెట్టారని ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Samayam Telugu ముఖ్యమంత్రి వైఎస్ జగన్



‘‘ఓటీఎస్ తో బాదుడు నేరుగా ఇంటి గుమ్మం తట్టింది. నేడు లేఔట్లలోకి వచ్చారు. 5 % లేఔట్ స్థలం లేదా మొత్తం లేఔట్ విలువలో 5% వసూలు చేయాలంటూ జీవో ఇచ్చిన ప్రభుత్వం. భూమి ఎవరు ఇవ్వరు.. డబ్బులే కడతారు. ఈ బాదుడేంటని ప్రశ్నించకుండా ఇచ్చిన భూమి పేదలకి వాడతాము అని నాటకం. ఇది జగన్ రెడ్డి మార్క్ రాజకీయం!’’ అంటూ ఐ టీడీపీ ఖాతాలో ట్వీట్ చేశారు.

‘‘ఏ వర్గాన్ని వదలరు,ఏ రంగాన్ని వదలరు.. ఏ ప్రాంతాన్ని వదలరు,ఏ జిల్లాని వదలరు.. పంచ భూతాలని వదలరు, పంచ కట్టిన రైతుని వదలరు.. బడిని వదలరు, గుడిని వదలరు.. కరిగిపోతుంది మన ఆంధ్ర జాతి సంపద.. తరలిపోతోంది మన జ్ఞాన సంపద.. విషపు వలయం సమస్తం.. ‘విలయం’ అతి సమీపం. మేలుకుందాం, తేరుకుందాం, పోరాడుదాం!!’’ అని ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.