యాప్నగరం

విశాఖలో టీడీపీకి బిగ్ షాక్.. 28న వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 26 Aug 2020, 11:14 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా, తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
Samayam Telugu చంద్రబాబు


ఈ నెల 28వ తేదీ (శుక్రవారం)న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పంచకచర్ల రమేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్నట్లు తెలిసింది. పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటు పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు.
అనంతరం 2019 ఎన్నికల్లో రమేష్‌బాబు యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో విశాఖ రూరల్‌ ప్రాంతంలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.