యాప్నగరం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చనిపోయారంటూ వదంతులు.. ప్రభాకర్ చౌదరి భావోద్వేగం!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోగ్యం వస్తున్న పుకార్లను ఆయన తీవ్రంగా ఖండించారు.

Samayam Telugu 19 Aug 2020, 4:00 pm
‘వియ్ మిస్ యూ చౌదరి అన్న’ అంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులపై తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరో తనపై కావాలనే వందతులు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, తనపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ప్రభాకర చౌదరి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
Samayam Telugu ప్రభాకర్ చౌదరి


ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై ఆయన భావోద్వేగం చెందారు. వ్యక్తిగత పనుల మీద తాను బెంగళూరుకు వచ్చానని, భగవంతుని దయ వల్ల క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

తనపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న వికృత క్రీడ ఇదని ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభాకర చౌదర్ ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.