యాప్నగరం

మీ పేర్లు, గోత్రాలు డైరీలో రాస్తున్నా, చరిత్ర ముగుస్తుంది.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

గురజాల నియోజకవర్గంలో తమపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు.

Samayam Telugu 22 May 2020, 5:53 pm
గురజాల నియోజకవర్గంలో తమపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీకి చెందిన వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. ఇప్పుడు విర్రవీగుతున్న వైసీపీ వారికి తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.
Samayam Telugu యరపతినేని శ్రీనివాసరావు


‘‘వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్‌ ఇష్టానుసారం టీడీపీపై, టీడీపీ నేతలపై పోస్టుపెడుతోంది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి. అధికారం ఉందని విర్రవీగితే అధికారం పోయిన తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. విర్రవీగుతూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న వారి పేర్లు, గోత్రాలు, చిరునామాలను డైరీలో రాసుకుంటున్నా.

చరిత్రలో మీకు ఎలాంటి ముగింపు ఉంటుందో చూస్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. మీ ప్రభుత్వం పని అయిపోయింది. ఏడాదిలోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్త వ్యవహరించాల్సిందిగా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ను హెచ్చరిస్తున్నా” అంటూ యరపతినేని శ్రీనివాస్ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా, గురజాలలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు యరపతినేనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.