యాప్నగరం

TDPకి జగన్ సర్కార్ ట్విస్ట్.. అనుమతి నిరాకరణ, తప్పనిసరి పరిస్థితుల్లో!

Ongole Tdp Mahanadu: టీడీపీ మహానాడుకు వేదిక ఫైనల్ అయ్యింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా అనుమతి నిరాకరించారు. దీంతో వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 16 May 2022, 2:06 pm

ప్రధానాంశాలు:

  • ఈ నెల 27, 28 మహానాడు కార్యక్రమం
  • ముందు ఒంగోలు సమీపంలో వేదిక
  • తర్వాత మిని స్టేడియం కోసం దరఖాస్తు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu టీడీపీ
టీడీపీ మహానాడు నిర్వహణపై కొద్దిరోజులుగా గందరగోళం కొనసాగింది. వేదికపై తర్జనభర్జనలు పడిన నేతలు మొత్తానికి ఫైనల్ చేశారు. మహానాడు వేదికపై క్లారిటీ ఇచ్చారు. ఒంగోలులోని మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో.. త్రోవగుంట ప్రాంతంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు.
మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో మహానాడు నిర్వహణకు టీడీపీ ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. అయితే చివరి నిమిషం వరకు నాన్చి..స్టేడియం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో టీడీపీ మొదట తాము పరిశీలించిన మండువారిపాలెం గ్రామ సమీపంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.

ముందుగా దరఖాస్తు చేసుకున్నా.. అసవరం అయిన ఫీజులు చెల్లించినా ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోవడంపై టీడీపీ మండి పడింది. స్టేడియం ఎందుకు ఇవ్వరు.. ఇదేమన్నా వాళ్ల తాతగారి జాగిరా అంటూ నేతలు మండిపడ్డారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ కు టీడీపీ అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని ఆయన అన్నారు. మహానాడుకు సమయం దగ్గరపడుతున్న కారణంగా పనులు వేగవంతం చెయ్యాలని అధినేత సూచించారు. బుధవారం నాడు మహానాడు ప్రాంగణంలో పనులు ప్రారంభించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.