యాప్నగరం

నెల్లూరు: టీడీపీ కార్యకర్త ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న కార్తీక్.. ఆత్మహత్యకు దగదర్తి ఎస్సై సుబ్బారావు వేధింపులే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు. వైఎస్సార్‌సీపీ నేతలు‌ చెప్పినట్టు నడుచుకోవాలంటూ వేధింపులు.

Samayam Telugu 13 Nov 2019, 11:36 am
నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య కలకలంరేపుతోంది. దగదర్తిలో కార్తీక్ అనే యువకుడు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ ఆత్మహత్యకు దగదర్తి ఎస్సై సుబ్బారావు వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు‌ చెప్పినట్టు నడుచుకోవాలంటూ ఎస్సై సుబ్బారావు కార్తీక్‌ను వేధించారని.. తమ హోటల్‌ను కూడా తొలగించారని యువకుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu nlr suicide


Rea Also: తిట్టిపోసుకున్న నేతలిద్దరూ దగ్గరయ్యారు.. టీడీపీలో అనూహ్య పరిణామం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కనీసం కిందిస్థాయి అధికారులు కూడా టీడీపీ కార్యకర్తల మాట వినడం‌ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్‌ది ఆత్మహత్య కాదని.. వైఎస్సార్‌సీపీ నేతల కోసం ఎస్సై చేసిన హత్య అంటూ ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. మరోవైపు కార్తీక్ ఆత్మహత్యపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.