యాప్నగరం

YSRCP ఎంపీ ట్వీట్.. షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు, ఆ ఫోటో వైరల్

వైఎస్సార్‌సీపీ రాజమండ్రి ఎంపీ భరత్ ట్వీట్ చేసిన రెండు ఫోటోలపై రగడ మొదలైంది. ఎంపీ ట్వీట్‌పై టీడీపీ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్ మొదలు పెట్టారు. ఎంపీ ఫేక్ ఫోటోలతో తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు.

Samayam Telugu 14 Oct 2020, 1:47 pm
ఏపీలో వర్షాలు, వరదలపై వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య వార్ జరుగుతోంది. వర్షాలకు అమరావతి మునిగిపోయిందని అధికార పార్టీ.. ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. పోటా పోటీగా వీడియోలు, ఫోటోలను ట్వీట్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
Samayam Telugu ట్వీట్ వార్


ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ రాజమండ్రి ఎంపీ భరత్ ట్వీట్ చేసిన రెండు ఫోటోలపై రగడ మొదలైంది. అమరావతి ప్రాంతం వరదలో మునిగిపోయిందని ప్రస్తావిస్తూ ‘దీనినేనా మార్చొద్దు అంటుంది అన్నీ ఇక్కడే వుండాలా చంద్రబాబు గారు.. గట్టిగా వరదలు వస్తే రాష్ట్ర రాజధాని అని చెప్పుకోవడానికి పేరు కూడా ఉండదు’అన్నారు.
ఎంపీ ట్వీట్‌పై టీడీపీ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్ మొదలు పెట్టారు. ఎంపీ ఫేక్ ఫోటోలతో తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
ఎంపీ భరత్ ట్వీట్ చేసిన ఫోటో ఆగస్టు నెలలోది.. అది కూడా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఫోటో అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. బుద్ధుడి విగ్రహం వుండే పాత అమరావతి గ్రామం.. రాజధాని పరిధిలోకి రాదు అంటున్నారు. బాధ్యతగల ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలాంటి ఫేక్ ఫోటోలతో ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజాలు తెలుసుకుని ట్వీట్లు చేయాలంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.