యాప్నగరం

మరోసారి వార్తల్లో చింతమనేని.. నోటికి పని, ఆ ఎమ్మెల్సీలకు సన్మానం

సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులకు వ్యతిరేకించిన ఎమ్మెల్సీలను ఆయన సన్మానించారు

Samayam Telugu 29 Jan 2020, 8:35 pm
తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకించిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎమ్మెల్సీలకు సన్మానం చేశారు. అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు.
Samayam Telugu chintamaneni


రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు. తనకు నచ్చనివన్నింటినీ సీఎం జగన్ రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం తన మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌పై ఆయన సోదరికే నమ్మకం లేకపోతే.. ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

అలాగే ఎమ్మెల్సీల సన్మానానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ సెలెక్ట్ కమిటీకి పంపటంలో తమ పదవులను సైతం లెక్కచేయకుండా పోరాడిన జిల్లా ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజును సన్మానించినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.