యాప్నగరం

జనాలు రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు.. సీఎం ఫోటో షేర్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే భర్త

రాష్ట్రంలో తాజా పరిణామాలపై టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. జనాలంతా రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్నారన్నారు.

Samayam Telugu 17 Oct 2020, 6:49 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. జనాలంతా రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్నారన్నారు. అదేంటి ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత జగన్ రావాలని అనడం ఏంటని అనుకుంటున్నారా.. ఆయన అక్కడే ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జనాలు కష్టాల్లో ఉన్నారని.. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని.. లేకపోతే ఏరియల్ సర్వేతో సరిపెడతారా అంటూ ప్రశ్నించారు.
Samayam Telugu సీఎం జగన్


‘అకాల వర్షాల వల్ల నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ....రావాలి జగన్... కావాలి జగన్ అంటున్నారు... మరి వస్తారా... ? లేకపోతే ఏరియల్ సర్వేతో సరిపెడతారా..?’ అంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దంపతులు రెండు, మూడు రోజులుగా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. అంతేకాదు కొద్దిరోజులుగా ఏపీ సీఎంను ఆయన ఫేస్‌బుక్‌లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కరోనాకు వైద్యం కోసం ఏపీ మంత్రులు, ఇతర నేతలు హైదరాబాద్ వెళ్లడంపైనా విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.