జగన్ మోహన్ రెడ్డి 1000 రోజల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేశారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతల అవినీతి ఫలాలు అన్నీ ప్రజలపై భారాలపై పోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్పా.. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో 60 కార్పొరేషన్ల పేరుతో చైర్మన్లను నియమించి.. వారికి టీ తాగేందుకు డబ్బులు లేకుండా బడ్జెట్ లేకుండా చేశారని ఆరోపించారు. కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరినా లోన్ ఇచ్చామని నిరూపించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులందరూ నష్టపోయారని బోండా ఉమా అన్నారు. అసంఘటిత కార్మికుల జీవితాలు గత మూడేళ్ల నుంచి తలకిందలయ్యాయని వాపోయారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి ఇటు ప్రజా కోర్టులో.. అటు న్యాయస్థానంలో శిక్ష పడక తప్పదని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అందినకాడికి దోచుకుని.. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అసమర్థ పాలనపై టీడీపీ ప్రజల్లోకి వెళుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఇదే చివరి ఛాన్స్ అని.. ఆ పార్టీకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత లేదన్నారు.
'నాయనా.. జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులారా..! ఇప్పటికి దోచింది చాలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది చాలు. ఎక్కడిక్కడ దోచేశారు. ఆ భారాలన్నీ ప్రజలపై పడ్డాయి. ఇంకా మీరు పరిపాలన కొనసాగిస్తే.. రాష్ట్రం నుంచి ప్రజలే వెళ్లిపోయే పరిస్థితి ఉంది. వైఎస్సార్సీపీ ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధం. టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం..' అని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులందరూ నష్టపోయారని బోండా ఉమా అన్నారు. అసంఘటిత కార్మికుల జీవితాలు గత మూడేళ్ల నుంచి తలకిందలయ్యాయని వాపోయారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి ఇటు ప్రజా కోర్టులో.. అటు న్యాయస్థానంలో శిక్ష పడక తప్పదని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అందినకాడికి దోచుకుని.. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అసమర్థ పాలనపై టీడీపీ ప్రజల్లోకి వెళుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఇదే చివరి ఛాన్స్ అని.. ఆ పార్టీకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత లేదన్నారు.
'నాయనా.. జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులారా..! ఇప్పటికి దోచింది చాలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది చాలు. ఎక్కడిక్కడ దోచేశారు. ఆ భారాలన్నీ ప్రజలపై పడ్డాయి. ఇంకా మీరు పరిపాలన కొనసాగిస్తే.. రాష్ట్రం నుంచి ప్రజలే వెళ్లిపోయే పరిస్థితి ఉంది. వైఎస్సార్సీపీ ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధం. టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం..' అని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు.