మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇసుక కొరత నేపథ్యంలో ఎమ్మెల్యే ఇసుకారుడి అవతారమెత్తి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని దేవినేని ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అదే స్థాయిలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కూడా ధీటుగా జవాబిచ్చారు. దమ్ముంటే నిరూపించాలని.. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇంటికొచ్చి చొక్కా పట్టోవాల్సి వస్తుందని ఘటుగా హెచ్చరించారు. ఈ ఎపిసోడ్తో ఇద్దరి వైరం తారస్థాయికి చేరింది.
తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికలకు ముందు వసంత కృష్ణ ప్రసాద్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. కరెన్సీ నోట్లను రెండు భాగాలుగా చించి ఒక భాగాన్ని జనానికి.. రెండోది అతని అనుచరుల వద్ద ఉంచుకున్నారన్నారు. ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల అనంతరం ఆ సగం నోటును తెచ్చి ఇవ్వాలని.. ఐదు వేల రూపాయల వరకూ అందజేస్తామన్నారని ఆరోపించారు. నోట్లు చించి పంచడాన్ని ఆయన మాఫియాతో పోల్చారు.
వసంత కృష్ణ ప్రసాద్ కంపెనీ సిబ్బంది, అనుచరులు నోట్లు పంచిపెట్టారని దేవినేని ఉమా విమర్శించారు. సగం నోటు ప్రజలకు ఇచ్చి.. ఎన్నికలైన తరువాత ఐదు వేల రూపాయలిస్తామని ప్రజలను మోసం చేసి విజయం సాధించారని ఆరోపించారు. కరెన్సీ నోట్లు చించి పంచే అధికారం వైఎస్సార్సీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ తతంగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అయ్యప్ప మాలలో ఉండి కూడా బూతులు తిట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read: పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం.. తెరిచిచూస్తే షాక్.. అదో పేద్ద హర్రర్ క్రైమ్ స్టోరీ
ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారంటూ చింపివేసిన నోట్లను ప్రదర్శించారు. నోట్ల చించివేతపై ఎన్నికల కమిషన్, కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ ఫిర్యాదు చేయనున్నట్లు దేవినేని తెలిపారు. నోట్ల వ్యవహారంపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను పత్రికల్లో రాసేందుకు జర్నలిస్టులు కూడా భయపడుతున్నారని, 2430 జీవోనే అందుకు కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇసుక కొరత, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై దేవినేని ఉమా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చూడని వ్యక్తి.. తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు పడితే కాంక్రీట్ వేయలేరంటూ ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందించారు. అబ్బో చాలా తెలుసుకున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రాజెక్టు పనులకు కొబ్బరికాయ కొట్టిన మంత్రి పత్తాలేడని.. సీఎం వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదన్నారు. మీ మొఖం మాకు నచ్చలేదంటూ కాంట్రాక్టర్లను మార్చివేస్తున్నారని ఆరోపించారు.
Read Also: ‘మహిళలను వేధిస్తే ఒక్క ఫోన్ కాల్.. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు’
ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారని.. అన్ని సీట్లొచ్చినా ఆయన అభద్రతా భావంతో ఉన్నారని దేవినేని ఉమా అన్నారు. తిరుమల దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సంప్రదాయాలను తూలనాడుతూ నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. మీ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి బాధ్యత లేదా అని నిలదీశారు.
తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికలకు ముందు వసంత కృష్ణ ప్రసాద్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. కరెన్సీ నోట్లను రెండు భాగాలుగా చించి ఒక భాగాన్ని జనానికి.. రెండోది అతని అనుచరుల వద్ద ఉంచుకున్నారన్నారు. ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల అనంతరం ఆ సగం నోటును తెచ్చి ఇవ్వాలని.. ఐదు వేల రూపాయల వరకూ అందజేస్తామన్నారని ఆరోపించారు. నోట్లు చించి పంచడాన్ని ఆయన మాఫియాతో పోల్చారు.
వసంత కృష్ణ ప్రసాద్ కంపెనీ సిబ్బంది, అనుచరులు నోట్లు పంచిపెట్టారని దేవినేని ఉమా విమర్శించారు. సగం నోటు ప్రజలకు ఇచ్చి.. ఎన్నికలైన తరువాత ఐదు వేల రూపాయలిస్తామని ప్రజలను మోసం చేసి విజయం సాధించారని ఆరోపించారు. కరెన్సీ నోట్లు చించి పంచే అధికారం వైఎస్సార్సీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ తతంగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అయ్యప్ప మాలలో ఉండి కూడా బూతులు తిట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read: పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం.. తెరిచిచూస్తే షాక్.. అదో పేద్ద హర్రర్ క్రైమ్ స్టోరీ
ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారంటూ చింపివేసిన నోట్లను ప్రదర్శించారు. నోట్ల చించివేతపై ఎన్నికల కమిషన్, కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ ఫిర్యాదు చేయనున్నట్లు దేవినేని తెలిపారు. నోట్ల వ్యవహారంపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను పత్రికల్లో రాసేందుకు జర్నలిస్టులు కూడా భయపడుతున్నారని, 2430 జీవోనే అందుకు కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇసుక కొరత, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై దేవినేని ఉమా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చూడని వ్యక్తి.. తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు పడితే కాంక్రీట్ వేయలేరంటూ ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందించారు. అబ్బో చాలా తెలుసుకున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రాజెక్టు పనులకు కొబ్బరికాయ కొట్టిన మంత్రి పత్తాలేడని.. సీఎం వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదన్నారు. మీ మొఖం మాకు నచ్చలేదంటూ కాంట్రాక్టర్లను మార్చివేస్తున్నారని ఆరోపించారు.
Read Also: ‘మహిళలను వేధిస్తే ఒక్క ఫోన్ కాల్.. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు’
ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారని.. అన్ని సీట్లొచ్చినా ఆయన అభద్రతా భావంతో ఉన్నారని దేవినేని ఉమా అన్నారు. తిరుమల దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సంప్రదాయాలను తూలనాడుతూ నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. మీ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి బాధ్యత లేదా అని నిలదీశారు.