యాప్నగరం

Mla Roja: 'అది మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు.. రోజా గారు'

వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ.. ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి నిరసన సెగతో రాజకీయ వేడి. చంద్రబాబు అండ్ కో దాడికి కుట్ర చేసిందన్న రోజా.. సొంత నియోజకవర్గంలోనే రోజాను ప్రజలు ఛీకొట్టారన్న దివ్యవాణి.

Samayam Telugu 20 Feb 2020, 10:50 pm
ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత దివ్యవాణి మండిపడ్డారు. పాలనంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్‌ స్కిట్ కాదని రోజా తెలుసుకుంటే మంచిదన్నారు దివ్యవాణి. అసెంబ్లీలో రోజా డైలాగులు చెబుతున్నారని.. భజన కార్యక్రమాలు ఆపి ప్రజా సమస్యల్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గతంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు హుందాగా వ్యవహరించారని.. రోజా తీరుతో సినిమా ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వస్తోందన్నారు.
Samayam Telugu రోజా


Read Also: రైతుల ముసుగులో నాపై దాడికి కుట్ర పన్నారు: రోజా

రోజాను సొంత నియోజకవర్గం ప్రజలే ఛీ కొడుతున్నారని.. చంద్రబాబునను విమర్శించే స్థాయి ఆమెకు లేదన్నారు దివ్యవాణి. ఓ వైపు సీఎం జగన్ దొంగదారిన వెళ్లిపోతున్నారని.. ఇప్పుడు రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేక.. కారు దిగకుండా అలాగే వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు అమరావతి ప్రజల మధ్యకు రాలేని పరిస్థితి ఉందన్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనతో ఏపీ పతనం అవుతోందని దివ్యవాణి విమర్శించారు. అమరావతి ప్రజలను పోలీసులతో దారుణంగా కొట్టిస్తున్నారని.. నవమాసాలు అంటే 9 నెలల జగన్ పాలనలో నవమోసాలు బయటకు వచ్చాయని.. అందుకే ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని.. చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రను చూసి అధికార పార్టీలో భయం మొదలైంది అన్నారు.

ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా అమరావతికి వెళ్లారు. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. ఆ విషయం తెలియడంతో రాజధాని రైతులు, మహిళలు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రోజా కారును కూడా అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు.. వారు వెనక్కు తగ్గకపోవడంతో రోజా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.