ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివ్యవాణి. అమరావతి మహిళల్ని కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలపై దారుణంగా లాఠీఛార్జ్ జరిగితే రోజా ఎందుకు స్పందించలేదని.. పదవుల కోసం నోరు మెదపరా అంటూ ప్రశ్నించారు. శనివారం ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన రోజా తీరుపై విరుచుకుపడ్డారు.
రోజా మగతనాల గురించి మాట్లాడొద్దు.. తాము ఆమెలా మాట్లాడగలమని.. కానీ సంస్కారం ఉందన్నారు. రోజా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే రోజా.. ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
వైఎస్ జగన్ జైల్లో ఉంటే ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయలేదా అని దివ్యవాణి ప్రశ్నించారు. వారు మహిళలన్న విషయం రోజాకు తెలియదా అన్నారు. ఇటు అమరావతితో పాటూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతుంటే.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రోజా మగతనాల గురించి మాట్లాడొద్దు.. తాము ఆమెలా మాట్లాడగలమని.. కానీ సంస్కారం ఉందన్నారు. రోజా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే రోజా.. ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
వైఎస్ జగన్ జైల్లో ఉంటే ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయలేదా అని దివ్యవాణి ప్రశ్నించారు. వారు మహిళలన్న విషయం రోజాకు తెలియదా అన్నారు. ఇటు అమరావతితో పాటూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతుంటే.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.