యాప్నగరం

ప్రశ్నిస్తే చంపేస్తాడు.. జగన్‌పై లోకేశ్ సంచలన ఆరోపణలు

జనసేన కార్యకర్త ఆత్మహత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇవి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలని ఆయన ఆరోపించారు.

Samayam Telugu 19 Jan 2021, 2:29 pm
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని మాటల దాడి చేస్తుండగా.. టీడీపీ నేత నారా లోకేశ్.. జగన్‌పై గురిపెట్టారు. గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును నిలదీసిన జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని నారా లోకేశ్ ప్రస్తావించారు.
Samayam Telugu jagan-lokesh


‘‘ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత వైఎస్ జగన్. రూ. 25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్‌ని చంపేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలం, శింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ.. స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించిన వెంగయ్యని చంపేశారు. ఇవి ప్రభుత్వ హత్యలే. చెత్త పాలనని ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కేసు క్లోజ్ చెయ్యడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం. వైకాపా రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’’ అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.