ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2022-23 ఏడాదికి గాను ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని లోకేష్ విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు.. జగన్మోసపు రెడ్డి అని ప్రజలు అంటున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని లోకేష్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను దారుణంగా మోసగించడమేనని మండిపడ్డారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారని దుయ్యబట్టారు. అమ్మ ఒడి ఒక అబద్ధమని.. నాన్న బుడ్డి అనేదే నిజమన్నారు. వాహన మిత్ర అబద్ధమని.. డ్రైవర్లను మోసం చేయడం నిజమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని లోకేష్ మండిపడ్డారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని లోకేశ్ ఆక్షేపించారు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి తెలుగుదేశం హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని లోకేష్ డిమాండ్ చేసారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయల మరాఠీ బడ్జెట్ అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్నారు. బడ్జెట్లో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేకపోవడం దుర్మార్గని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని లోకేష్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను దారుణంగా మోసగించడమేనని మండిపడ్డారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారని దుయ్యబట్టారు. అమ్మ ఒడి ఒక అబద్ధమని.. నాన్న బుడ్డి అనేదే నిజమన్నారు. వాహన మిత్ర అబద్ధమని.. డ్రైవర్లను మోసం చేయడం నిజమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని లోకేష్ మండిపడ్డారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని లోకేశ్ ఆక్షేపించారు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి తెలుగుదేశం హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని లోకేష్ డిమాండ్ చేసారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాయల మరాఠీ బడ్జెట్ అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్నారు. బడ్జెట్లో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేకపోవడం దుర్మార్గని చెప్పారు.