యాప్నగరం

సీఎం జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు? పోల్ పెట్టిన లోకేష్.. ఓ రేంజ్‌లో కామెంట్స్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటూ ట్విట్టర్‌లో పోల్ పెట్టారు.

Samayam Telugu 5 Apr 2022, 4:13 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర కామెంట్స్ చేశారు. అలాగే, సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. ఈ మేరకు నారా లోకేష్ మంగళవారం ట్వీట్ చేశారు. పేలని జ‘గన్’ హస్తిన పయనమెందుకు? అంటూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్‌లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చి పోల్ పెట్టారు.
Samayam Telugu నారా లోకేష్, సీఎం జగన్


‘‘పేలని జ‘గన్’ హస్తిన పయనమెందుకు?
ఏ1: బాబాయ్ హత్య కేసులో దొరికిన అవినాష్‌రెడ్డిని తప్పించేందుకు.
ఏ2: తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని.
ఏ3: తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని.
ఏ4: లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా.. మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని అనే నాలుగు ఆప్షన్స్‌ను నారా లోకేష్ ఇచ్చారు.’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.


దీంతో, లోకేష్ కామెంట్స్‌కు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు, వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అలాగే, కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో లోకేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.