యాప్నగరం

YS Jagan మోసానికి మరో పేరు, మరో రత్నం జారిపోయిందిగా: టీడీపీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్కో రైతన్నను సీఎం జగన్ రూ. 25 వేల దగా చేస్తున్నారని ఆరోపించారు.

Samayam Telugu 15 May 2020, 10:45 pm
రాష్ట్రవ్యాప్తంగా 49 లక్షల మంది ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూ. 5,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సీఎంను టార్గెట్ చేసింది. శుక్రవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Samayam Telugu సీఎం జగన్


‘‘మోసానికి మరో పేరు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. మేనిఫెస్టోలో నవరత్నాలు అని పెద్దగా రాశారు. ఇప్పుడు చివర్లో షరతులు వర్తిస్తాయి అని కనపడకుండా రాశామంటున్నారు. రైతు భరోసా పేరుతో రైతులను దగా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు 12,500 ఇస్తుంది అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ. 5 వేలు కోత పెట్టి కేవలం 7,500 ఇస్తున్నారు. ఒక్కో రైతన్నను ఐదేళ్లలో జగన్ గారు చేస్తున్న దగా 25 వేలు.

కరోనా దెబ్బ, మీ ప్రభుత్వ అసమర్థత వల్ల పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అన్నట్టు ప్రతి రైతుకు ఏడాదికి లక్ష రూపాయిలు లబ్ధి చేకూరేలా చేస్తాం అన్నారు, ఆ రత్నం కూడా జారిపోయిందా జగన్ గారు.’’ అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.