యాప్నగరం

AP Capital: వాస్తవాలు తొక్కిపెట్టి మూడు ముక్కలాట.. జగన్‌పై లోకేశ్ ఫైర్

GN Rao Committee, BCG Report | వాస్తవాలను తొక్కి పెట్టి జగన్ మూడు ముక్కలాటను మెదలుపెట్టారని రాజధాని విషయమై లోకేశ్ ఆరోపణలు గుప్పించారు.

Samayam Telugu 29 Jan 2020, 4:15 pm
మూడు రాజధానుల విషయమై ఏపీ సీఎం జగన్‌ను టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి టార్గెట్ చేశారు. జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టుల్లో వాస్తవాలు తొక్కిపెట్టి మూడు ముక్కలాట మొదలుపెట్టారంటూ ఏపీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. చేసిన దొంగ పనులు బయటపడతాయన్న భయంతో మండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లగానే జగన్ గారు ఉలిక్కిపడ్డారని టీడీపీ నేత ట్వీట్ చేశారు. రిపోర్టులు మార్చడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక నుంచి తైలం తీసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వినాశకారి ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu lokesh jagan


ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కాగా సముద్ర తీరాన ఉన్న విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పరిమితులు ఉన్నాయని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో పేర్కొందని తెలుస్తోంది. సాగర జలాలు చొచ్చుకు రావడం, తీరం కోతకు గురి కావడం, ఉప్పు నీరు, కాలుష్యం, భూముల లభ్యత తక్కువగా ఉండటం, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిందని సమాచారం.

ఎన్నో పరిమితులు ఉన్నందున పరిపాలన కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి విశాఖ నగరం అనువైంది కాదని జీఎన్ రావు కమిటీ రిపోర్టు ఇచ్చిందని, బీసీజీ రిపోర్ట్ కూడా తుఫాన్ల ముప్పు గురించి హెచ్చరించిందని వార్తలొచ్చాయి. దీంతో ఈ విషయాలను దాచి జగన్ సర్కారు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.