యాప్నగరం

Kodela Siva Prasada Rao రాసిన లేఖను బయటపెట్టిన నారా లోకేష్

'నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెల శివప్రసాదరావు గారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖ కూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు'. లేఖను ట్వీట్ చేసిన నారా లోకేష్.

Samayam Telugu 17 Sep 2019, 9:09 pm
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ కోడెల శివప్రసాదరావు మరణం, తర్వాత పరిణామాలపై వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలపై స్పందించారు టీడీపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ‘కోడెలకు ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకు విజయసాయిరెడ్డి కుట్ర చేయలేదా.. మీరు దొంగలని.. అందర్ని దొంగలనడం నీచనమైన ఆలోచన’అంటూ ఘాటు ట్వీట్‌లు చేశారు.
Samayam Telugu కోడెల


Read Also: కోడెల కుమారుడు విదేశాల్లో ఉండబట్టి సరిపోయింది.. బాబు సంచలన వ్యాఖ్యలు

‘ఐపీసీ 420 కింద కేసులున్న ప్రబుద్ధులు అలాంటి పనులే చేస్తారని పెద్దలంటుంటారు జగన్ గారు! కోడెలగారి విషయంలో కూడా మీరు అదే చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెలగారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖకూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు. అలాంటప్పుడు కేసులెలా పెడతారు?’అంటూ ప్రశ్నించారు.
‘ఇదంతా మీరు, మీ శకుని మామ విజయసాయిరెడ్డి కలిసి కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, సమాజంలో వారికున్న మంచిపేరును చెడగొట్టేందుకు పన్నిన కుట్ర కాదా? మీరు దొంగలు అయినంత మాత్రాన అందరూ అలాంటివారి అనుకుంటే అంతకంటే నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదు’అన్నారు నారా లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.