యాప్నగరం

అలా చేయడానికి సిగ్గు లేదా? జగన్ సర్కార్‌పై లోకేష్ ఆగ్రహం

ఉద్యోగాల కోసం అనంతపురంలో ఆందోళన చేసిన నిరుద్యోగులపై కేసులు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఆక్షేపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే క్రిమినల్ కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 17 Oct 2019, 1:01 pm
పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు కక్షసాధింపులకు పాల్పడుతున్నారంటూ జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిరుద్యోగులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పాదయాత్ర సమయంలో కోటి 70 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పారని, ఆ హామీనే అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని లోకేష్ అన్నారు.
Samayam Telugu Jagan desk new




గ్రామ వాలంటీర్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీక్ చేసి పరీక్షలకు హాజరైన 20 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగినందుకు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులపై ఎందుకంత కక్ష అని లోకేష్ ప్రశ్నించారు.

Also Read: అందరూ ‘మీ కొడుకులా’ కాదు.. చంద్రబాబుపై ఎంపీ విజయసాయి ఘాటు విమర్శలు

అధికారంలోకి రాగానే కోటి 70 లక్షల ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పారంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు. యువతను ఉద్ధరించేస్తామని చెప్పి క్రిమినల్ కేసులు నమోదు పెడతారా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన అనంతపురం యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.