యాప్నగరం

ఏపీ ఉద్యోగుల కష్టం.. పగవాడికి కూడా రాకూడదు.. యువనేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదంటూ..!

Samayam Telugu 29 Nov 2021, 11:19 pm
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకటనపై జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ఉద్యోగులకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదన్నారు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరమన్నారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చేయాలని.. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చెయ్యకుండా సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం



‘‘ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరం. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న రూ.1,600 కోట్లను ప్రభుత్వం ఇవ్వక పోవటం దారుణం.

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చెయ్యాలి. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చెయ్యకుండా సిపిఎస్ రద్దు చెయ్యాలి. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చెయ్యాలి. పెండింగ్లో పెట్టిన 7 డీఏలు వెంటనే ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.