యాప్నగరం

ఏపీ అసెంబ్లీ: డ్రోన్ కలకలం.. నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం

నారా లోకేష్ అసెంబ్లీకి ఎమ్మెల్సీలతో కలిసి పాదయాత్రగా వెళుతున్న సమయంలో ప్రమాదం. ఒక్కసారిగా పై నుంచి కిందపడిన డ్రోన్.. ఉలిక్కిపడిన నేతలు. విద్యుత్ తీగలకు తగలడంతో కిందపడిన డ్రోన్.

Samayam Telugu 11 Dec 2019, 9:40 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా డ్రోన్ కెమెరా విద్యుత్ తీగలకు తగిలి కిందపడిపోయింది. డ్రోన్ ఒక్కసారిగా కిందపడటంతో ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్సీలు ఉలిక్కిపడ్డారు. భయంతో ఏం జరిగిందో అర్థంకాక గందరగోళంతో ఉండిపోయారు.. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu nara lokesh


Read Also: జగన్‌లా పులివెందుల్లో కాదు.. నేను టీడీపీ ఓడిన చోట: లోకేష్

అసెంబ్లీ ఆవరణలో భద్రత కోసం.. ఈ డ్రోన్‌ను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.. ప్రతి రోజు ఈ డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతున్నారట. ఈ క్రమంలోనే పైకి ఎగిరిన డ్రోన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.. వెంటనే అక్కడికి చేరుకొని డ్రోన్‌ను తీశారు.

Also Read: నేను పప్పు, జగన్ గన్నేరు పప్పు.. వీడియోతో లోకేష్ సెటైర్లు

ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మూడో రోజు కూడా టీడీపీ పెంచిన బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చారు.. అసెంబ్లీ దగ్గర దిగి.. ఎమ్మెల్సీలతో కలిసి పాదయాత్రగా లోపలికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.