యాప్నగరం

'జగన్ గారూ.. వాలంటీర్లకు నెలకు రూ.8వేలు, అన్నదాతకు రూ.650 మాత్రమేనా'

Ysr Rythu Bharosa| ‘ఎన్నికల హామీలో రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు. 64 లక్షలమంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారు’

Samayam Telugu 15 Oct 2019, 4:49 pm
సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. రైతు భరోసా పథకం కింద రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నారు. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారు.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారు.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నారు. ఈ పథకంపై ప్రతిపక్షం టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. రైతు భరోసా విషయంలో జగన్ మాట తప్పారంటూ ఆరోపిస్తోంది. పాదయాత్ర చేస్తున్న సమయంలో భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు మాత్రం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లకు ప్రతి నెలా రూ. 8వేల వేతనం ఇస్తున్నారని.. రైతుకు మాత్రం రూ.625 ఇస్తారా అని ప్రశ్నించారు.
Samayam Telugu ys jagan


Read Also: 'జగన్ మాట తప్పారు.. పాదయాత్రలో చెప్పిందేంటి, ఇప్పుడు చేసిందేంటి'

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘వాయిదా పద్ధతి సీఎం జగన్ గారూ, మీరు ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతునిరాశ కార్యక్రమం. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు. 64 లక్షలమంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారు’అంటూ ఎద్దేవా చేశారు.
‘కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారు. మీ పార్టీ వాలంటీర్లకి నెలకు రూ.8000 ఇస్తూ.. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 ఇవ్వడం న్యాయమా?’అంటూ లోకేష్ జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.