యాప్నగరం

జరగాలి పెళ్లి, మళ్లీ మళ్లీ.. అలా ఉంది మీ వ్యవహారం! జగన్‌పై లోకేష్ సెటైర్లు

వైఎస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ నాటకాలు ఆడుతోందంటూ లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు.

Samayam Telugu 20 Sep 2019, 1:06 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి టార్గెట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎప్పుడో రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాల అనుమతులను తామే రద్దు చేశామన్నట్లు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004కి ముందే చంద్రబాబు ప్రకటించారన్నారు. అందుకు అనుగుణంగా అప్పుడే నిర్ణయం తీసుకున్నారన్నారు.
Samayam Telugu Jagan serious desk


Must Read:కోడెల మృతి: సాక్షి, విజయసాయిపై కేసులు! టీడీపీ నిర్ణయం?

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రస్‌ ఆల్ ఖైమా సంస్థను బాక్సైట్ తవ్వకాల కోసం తీసుకొచ్చారని లోకేష్ విమర్శించారు. మళ్లీ 2014లో చంద్రబాబు ప్రభుత్వం తవ్వకాలకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ నాటకాలు చూసి సిగ్గు కూడా సిగ్గు పడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read:గోదావరి బోటు జాడ: ఎర్రనీళ్లతో ఇబ్బందులు? ఆ రిపోర్ట్ వచ్చాకే ఫుల్ క్లారిటీ!

‘అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని కామెడీ చేసినట్లు, ఎత్తేసిన కేసులనే మళ్ళీ ఎత్తేయడం, ఇదివరకే రద్దు చేసిన వాటిని మళ్లీ మళ్ళీ రద్దు చేయడం లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్ లాగ మిగిలిపోతారు’ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.