యాప్నగరం

మాట మార్చుడు... మడమ తిప్పుడు.. జగన్‌పై లోకేశ్ సెటైర్లు

YS jagan టార్గెట్‌గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు గుప్పించారు. సన్న బియ్యంపై జగన్ మాట తప్పారంటూ ఆయన విమర్శలు ఎక్కుబెట్టారు. మాట మార్చుడు.. మడమ తిప్పుడు అంటూ ఎద్దేవా చేశారు.

Samayam Telugu 10 Dec 2019, 9:32 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌‌గా విమర్శలు గుప్పించారు. జగన్ మాట మార్చుడు... మడమ తిప్పుడు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. సన్నబియ్యం జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవి.. ఇప్పుడు ఆయన చెబుతోంది ఇదీ.. అని రెండు సందర్భాల్లో జగన్ మాట్లాడిన వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు. సాక్షి పేపర్ దొంగ పేపర్. అందులో రాసేవి అన్నీ అబద్ధాలే అని జగన్ స్వయంగా ప్రకటించారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu lokesh jagan


నాణ్యమైన సన్న బియ్యం సరఫరాపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం వాడీ వేడి చర్చ జరిగింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక చాలా సందర్భాల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పారని.. సీఎం, మంత్రులతో సమీక్ష చేశారని మీడియాలో వచ్చిన కథనాలను చూపించారు. సన్న బియ్యం హామీ ఏమైందని ప్రశ్నించారు.

టీడీపీ విమర్శలపై స్పందించిన జగన్.. తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్న బియ్యం అన్న అంశమే లేదని.. బియ్యం విషయంలో చెప్పని అంశాన్ని కూడా మేం చేసి చూపిస్తున్నాం అన్నారు.

స్వర్ణ రకాన్నే సన్నబియ్యం అంటారని.. తాము ఇచ్చే బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని జగన్ తెలిపారు. నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని.. గతంలో రేషన్ బియ్యం ఎవరూ తినలేని పరిస్థితి ఉండేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని.. శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పరిశీలించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.