యాప్నగరం

కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట: సీఎం జగన్‌పై లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమ్మ ఒడి పథకాన్ని అర్ధ ఒడిగా మార్చేశారని దుయ్యబట్టారు.

Samayam Telugu 15 Apr 2022, 9:28 pm
‘అమ్మ ఒడి’ పథకానికి ఎన్నో ఆంక్షలు పెట్టి.. అమ్మలని మానసిక క్షోభకి గురిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ రెడ్డి తీరని విమర్శించారు. ఎన్నో ఆంక్షలు పెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశారని ఫైరయ్యారు. ఈ మేరకు శుక్రవారం నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu నారా లోకేష్, సీఎం జగన్



‘‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పథకం తీరు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి అర్ధ ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి.. పథకం మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశారు.

300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు?

మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేశారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలి.’’ అని లోకేష్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.