ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ నెలాఖరు వరకు పర్యటన కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ను టీడీపీ టార్గెట్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ‘మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుంచి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చింది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో’ అంటూ సెటైర్లు పేల్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్కి ఇదే తొలి అధికారిక పర్యటన.. ఆయన వెంట పలువురు మంత్రులు, అధికారులు దావోస్కి వెళ్లారు. గతంలో ఆయన లండన్, అమెరికా వెళ్లినా అవి పూర్తిగా వ్యక్తిగత పర్యటనలు. దావోస్లో మే 22నుంచి 26 వరకూ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జగన్ తన బృందంతో కలిసి పాల్గొనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు.
వాస్తవానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు గతేడాది డిసెంబర్లోనే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. గత రెండేళ్లగా సమావేశాలు వర్చువల్గా జరుగుతున్నాయి. కరోనా పరిస్థితులు మారిపోయి.. కేసులు తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత ఈ సదస్సును ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఆహ్వానం అందడంతో ఆయన తన బృందంతో కలిసి దావోస్ వెళ్లారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు ఏటా దావోస్కి వెళ్లేవారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్నారు.
వాస్తవానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు గతేడాది డిసెంబర్లోనే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. గత రెండేళ్లగా సమావేశాలు వర్చువల్గా జరుగుతున్నాయి. కరోనా పరిస్థితులు మారిపోయి.. కేసులు తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత ఈ సదస్సును ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఆహ్వానం అందడంతో ఆయన తన బృందంతో కలిసి దావోస్ వెళ్లారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు ఏటా దావోస్కి వెళ్లేవారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్నారు.