యాప్నగరం

'లోకేష్ గెలిస్తే ఇళ్లు పోతాయన్నారు.. ఇప్పుడు జీవితాలే లేకుండా..'

'నారా లోకేష్ మంగళగిరిలో గెలిస్తే ఇళ్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేశారు. ఇఫ్పుడు మంగళగిరిలో జీవితాలే లేకుండా చేస్తున్నారు. పగులు, రాత్రి తేడా లేకుండా పోరాటం చేస్తున్నా పట్టించుకుంటున్నారా'

Samayam Telugu 11 Nov 2019, 7:24 am
ఏపీలో వెలుగు యానిమేటర్లను జగన్ సర్కార్ అన్యాయంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించిందని ఆరోపిస్తోంది టీడీపీ. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఏకపక్షంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని చెబుతోంది. అన్యాయంగా యానిమేటర్లను రోడ్లపై పడేశారని.. తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు ఉద్యోగులనే పట్టించుకోవడం లేదంటూ పరోక్షంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై మండిపడ్డారు.
Samayam Telugu lokesh


‘ఎన్నికల ముందు మంగళగిరిలో 'లోకేష్ గెలిస్తే మీ ఇళ్లు తొలగిస్తాడు' అని అసత్య ప్రచారం చేసిన నాయకుడు.. ఇప్పుడు మంగళగిరిలో జీవితాలే లేకుండా చేస్తున్నారు. మంగళగిరిలో వెలుగు యానిమేటర్లు పగలు, రాత్రి అని లేకుండా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు’అంటూ మండిపడ్డారు నారా లోకేష్.
‘మా అక్కా,చెల్లెలకు అండగా నేను ఉంటాను. వైకాపా వాలంటీర్ల పేరుతో ఏడాదికి రూ.4 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. అయినా మీ ధనదాహం తీరదా జగన్ గారు? 27,700 మంది యానిమేటర్లలో ఒక్కరి ఉద్యోగం పోయినా వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు’అంటూ లోకేష్ హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.