యాప్నగరం

‘బుల్లెట్ లేని జ‘గన్’ ఏం తెస్తారు?’ టీడీపీ పోల్.. ఆసక్తికర రిజల్ట్స్

జగన్ ఢిల్లీ టూర్‌పై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సీబీఐ కేసుల్లో బెయిల్ రద్దు కాకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని ఆరోపిస్తోంది.

Samayam Telugu 12 Jun 2021, 6:45 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడే టీడీపీ యువనేత నారా లోకేష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ లేని జ‘గన్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి డిఫరెంట్ పోల్ నిర్వహించారు. హస్తినకు వెళ్లిన జగన్ ఏమి తెస్తారంటూ ప్రశ్నించారు. దానికి నాలుగు సమాధానాలు ఇచ్చి కేసుల మాఫీ కోసమే ఆయన వెళ్లారని అధికశాతం మంది చెప్పినట్లు లెక్కలు తెలుపుతూ సంచలన ట్వీట్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
jagan


ఢిల్లీ వెళ్తోన్న బుల్లెట్ లేని జ‘గన్’ ఏమి తెస్తారు? అని అడిగిన ప్రశ్నకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధులు, కేసుల మాఫీకి హామీ అని నాలుగు సమాధానాలిచ్చారు. వాటిలో ప్రత్యేక హోదా తెస్తారని 6.4 శాతం, రైల్వే జోన్‌కి కేవలం 1 శాతం, పోలవరానికి నిధులు ఆప్షన్‌కి 13.7 శాతం , చివరగా కేసుల మాఫీకి హామీ కోసమంటూ 78.9 శాతం మంది ఓట్ చేశారంటూ లోకేష్ లెక్కలు ట్వీట్ చేశారు. అయితే లోకేష్ ట్వీట్‌పై జగన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.