యాప్నగరం

‘జగన్ గారూ! మీరసలు మనుషులేనా?’

ఇది ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు.

Samayam Telugu 16 Sep 2019, 9:52 pm
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావును కేసుల పేరుతో వేధించి ఆత్మహత్యకు కారణమయ్యారంటూ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. కోడెలది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్య హత్యేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడితే తండ్రీకొడుకుల మధ్య వివాదమంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారా? అని ప్రశ్నించారు.
Samayam Telugu ysjagan


దొంగ చానల్‌లో ఇష్టమొచ్చిన కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. కుటుంబ కలహాలంటూ తప్పుడు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడుకే కొట్టి చంపారంటూ కథనాలు ప్రసారం చేయడం ఏమిటని నిలదీశారు. మీరసలు మనుషులేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చావుకు ప్రభుత్వ వేధింపులే కారణమని, ఇప్పుడు ఆయన అంతిమయాత్రకు కూడా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. నరసరావుపేట డివిజన్‌లో 144 సెక్షన్ పెడతారా అంటూ వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు.

Must Read: భయం ఎరుగని వ్యక్తి.. అవమానాలకు బలైపోయారు.. చంద్రబాబు ఆవేదన

‘@ysjagan గారూ! శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలగారిని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హత్యేనన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు. కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా? అంటూ మండిపడ్డారు.

Also Read:కోడెలది హత్యే.. కుమారుడే చంపించాడు: కోడెల బావమరిది సాయి పోలీసులకు ఫిర్యాదు

‘ఆఖరికి కోడెల శివప్రసాద్ గారి అంతిమయాత్రని అడ్డుకునేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా @ysjagan గారు? అక్రమ కేసులతో మానసికంగా వేధించి వారి మృతికి కారణమయ్యారు. ఇప్పుడు ఆయన అంతిమయాత్రను ఆపేందుకు శాంతిభద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ మొత్తం 15 రోజులపాటు 144 సెక్షన్ అమలుచేస్తారా?’ అంటూ మండిపడ్డారు.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.