యాప్నగరం

నారా లోకేష్, బ్రాహ్మణి పూజలు.. అందుకేనట.!

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లోకేష్ సతీసమేతంగా పాల్గొన్నారు. చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Samayam Telugu 6 Dec 2019, 12:43 am
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌ల ప‌రిధిలోని ఆత్మకూరులో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లోకేష్ సతీసమేతంగా పాల్గొన్నారు.
Samayam Telugu lokesh 1.


Also Read: వోల్వో డ్రైవర్ వేధింపులు.. స్మార్ట్‌గా తిక్కకుదిర్చిన సాఫ్ట్‌వేర్ యువతి

శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో గురువారం కార్యాల‌యం ఆవర‌ణ‌లో ముందుగా గ‌ణ‌ప‌తి పూజ చేశారు. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం, గ‌ణ‌ప‌తి హోమం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. వేద‌పండితుల స‌మ‌క్షంలో పూర్ణాహుతి కార్య‌క్ర‌మం పూర్తి చేశారు. చంద్రబాబు మనవడు, లోకేష్ తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.