గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రైల్వే స్థలాల్లో ఇళ్ల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పుతో ఆక్రమణలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. శనివారం లోపు తొలగించాలని డెడ్ లైన్ విధించడంతో.. కరోనా సమయంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి బాధితులు ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నయం చూపించాలని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు. గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రైల్వే స్థలాల్లో నివాసితులకి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు వేరే చోట ఇళ్లు కట్టి తరలించే వరకూ, రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
నలభై ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న అట్టడుగువర్గాలకి చెందిన నిరుపేదలని ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై అత్యవసరంగా ప్రభుత్భం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేతలు ఈ రైల్వే స్థలంలో ఉన్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
కూలికెళితే కానీ కూడు దొరకని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 650 కుటుంబాల సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీ మేరకు 650 మందికి వేరే చోట ఇళ్లు కట్టి తరలించేవరకూ ఇక్కడే నివాసం ఉండేలా రైల్వే అధికారులని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
నలభై ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న అట్టడుగువర్గాలకి చెందిన నిరుపేదలని ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై అత్యవసరంగా ప్రభుత్భం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేతలు ఈ రైల్వే స్థలంలో ఉన్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
కూలికెళితే కానీ కూడు దొరకని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 650 కుటుంబాల సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీ మేరకు 650 మందికి వేరే చోట ఇళ్లు కట్టి తరలించేవరకూ ఇక్కడే నివాసం ఉండేలా రైల్వే అధికారులని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.