యాప్నగరం

‘జగన్.. నిజంగా నువ్వు మగాడివైతే’.. టీడీపీ మహిళా నేత ఘాటు వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌‌ను ఉద్దేశించి టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి నువ్వు మగాడివైతే ఓసారి బయటకు రా అని ఆమె సవాల్ విసిరారు.

Samayam Telugu 27 Feb 2020, 2:18 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పట్ల టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిగ్గుండాలి జగన్ మోహన్ రెడ్డి నీకు.. నిజంగా నువ్వు మగాడివైతే ఓసారి బయటకు రా. చంద్రబాబు నాయుడితో తేల్చుకో. అంతేగానీ నీ చెంచాగాళ్లతో చంద్రబాబు నాయుణ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఈరోజు చంద్రబాబు నాయుణ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఖాయం. నీ అంతు చూడటం ఖాయం’ అని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu jagan anitha


విశాఖపట్నానికి నూతన సంస్కృతిని తీసుకొచ్చారంటూ వైసీపీ నేతలపై వంగలపూడి గీత మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి భయపడి, ఆయనకు తట్టుకోలేక.. వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిసులకు రూ.500 ఇచ్చారని ఆమె ఆరోపించారు. ‘‘ఇది జగన్ మోహన్ రెడ్డి చేతగానితనం. చంద్రబాబు నాయుడ్ని ఎదుర్కొలేక ఈ రకమైన చెంచాగిరీ చేయిస్తున్నారు. విశాఖ ప్రజలు ఈ సంస్కృతిని చూస్తున్నారు కదా. రెడ్ల పరిపాలనలో ఇలాంటి సంస్కృతి ఉంటుంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’’ అని అనిత సూచించారు.

గుండాలు, రౌడీలు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుందన్న అనిత.. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో రెండు గంటలపాటు ఆగిపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు వైజాగ్‌ను ఎప్పుడో ఆర్థిక రాజధాని చేశారన్న అనిత.. పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ నాయకులు బాబును అడ్డుకుంటున్నారన్నారు. జగన్ అమరావతి వచ్చి జై అమరావతి అంటే.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు పట్ల బాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.