యాప్నగరం

వెనక్కి తగ్గని టీడీపీ.. రాజ్యసభ బరిలో రామయ్య

టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు.

Samayam Telugu 13 Mar 2020, 5:14 pm
రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల బరిలోకి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ దిగింది. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నా అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోటీ చేయబోతున్నట్లు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలోని రిటర్నింగ్‌ అధికారి, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినట్లు వర్ల రామయ్య వెల్లడించారు.
Samayam Telugu varla 3


టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే నామినేషన్‌ ఎలా వేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని వర్ల రామయ్య తెలిపారు. అయితే పెద్దల సభలో దళితుల వాదనలు విపించాలంటే తనను గెలిపించాలని 174 మంది ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాజ్యసభకు సంబంధించి వైసీపీకి దక్కబోయే నాలుగు సీట్లలో ఒక్కటి కూడా దళితులకు కేటాయించలేదని ఆయన విమర్శించారు.

గతంలో తన తండ్రిని చంపించారంటూ ఆరోపణలు చేసిన వారికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చారని వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ ముఖంలో కళ తప్పిందని వర్ల వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.