యాప్నగరం

‘సీఎం గారూ! దళితులను అడ్డుపెట్టుకుని ఆటలాడకండి’

కులం పేరుతో దూషించారంటూ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టారు. మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్సైని దుర్భాషలాడారన్న ఆరోపణలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Samayam Telugu 13 Sep 2019, 3:22 pm
దళితులతో ఆటలాడుకోవాలని చూస్తే చావుదెబ్బ తింటారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటు విమర్శలు చేశారు. దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి విషయానికీ దళితులను తెరపైకి తెచ్చి రాజకీయ ఆటవస్తువుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu Jagan serious desk


Must Read : నన్నపనేని కులదూషణ కేసు.. డీజీపీని కలిసిన ఎమ్మెల్యే ఆర్కే

దళితుల మనోభావాలతో ఆడుకుని అధికారంలోకి వచ్చారని గుర్తుంచుకోవాలని వర్ల రామయ్య సూచించారు. దళితులతో ఆట.. పులులతో వేట ఒక్కటేనని తెలుసుకో జగన్ అంటూ హెచ్చరించారు. అట్రాసిటీ చట్టాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం తగదన్నారు. రాజకీయ లబ్ధి కోసం దళితులను బలిపశువులను చేయొద్దని హితవు పలికారు.



కులం పేరుతో దూషించారంటూ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కంటతడి పెట్టిన వీడియోలు వైరల్ కావడంతో వ్యవహారం పెద్దదుమారమే లేపింది. ఒక ఎమ్మెల్యేకి ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమైంది. ఏపీ సీఎం జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాజాగా టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్సైని దుర్భాషలాడారంటూ ఆరోపణలు వచ్చాయి. దళితులను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్సై అనురాధ ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.