యాప్నగరం

‘కోడెల ఆత్మహత్య.. ప్రభుత్వం, ఆ చానలే కారణం’!

కోడెల పిరికివాడు కాదని, భయస్తుడు అంతకంటే కాదు. వరుస కేసులు, తప్పుడు ప్రచారంతో అవమానాలను తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Samayam Telugu 16 Sep 2019, 8:42 pm
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి చానలే కారణమని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోడెల, ఆయన కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడిందన్నారు. కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు. అదే పనిగా పేపర్‌లో, టీవీలో తప్పుడు కథనాలు వేసి ఇబ్బందులు పెట్టారన్నారు.
Samayam Telugu varla ramaiah_4785


Must Read: ‘కోడెలని సీఎం జగనే చంపేశారు’

కోడెల పిరికివాడు కాదని, భయస్తుడు అంతకంటే కాదని వర్ల స్పష్టం చేశారు. వరుస కేసులు, తప్పుడు ప్రచారంతో అవమానాలను తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రభుత్వంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్‌పైనా కేసు నమోదు చేయాలన్నారు. ఆత్మహత్యపై కూడా ఇష్టమొచ్చినట్లు ప్రసారం చేశారని ఆయన దుయ్యబట్టారు.

Also Read:కోడెలది హత్యే.. కుమారుడే చంపించాడు: కోడెల బావమరిది సాయి పోలీసులకు ఫిర్యాదు

కోడెల, ఆయన కొడుకు గొడవపడ్డారని కథనాలు వేయడాన్ని వర్ల తీవ్రంగా తప్పుబట్టారు. గొడవ కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం చేయడాన్ని ఏమనాలో తెలియడం లేదన్నారు. కోడెల కొడుకు ఇక్కడే ఉన్నట్లు నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు. పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం చేసి అవమానాలకు గురిచేశారన్నారు. అసలు వాళ్లని ఎలా తిట్టాలో కూడా అర్థం కావడం లేదన్నారు. చచ్చిపో.. చచ్చిపో అంటూ ఆత్మహత్య దాకా తీసుకెళ్లారని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.