యాప్నగరం

విదేశాలకెళ్లి అలాంటి వ్యాఖ్యలా? మంత్రి బుగ్గనపై యనమల ఆగ్రహం

సింగపూర్ వెళ్లిన మంత్రి రాష్ట్ర ప్రతిష్ట పెంచేలా మాట్లాడాలి. కానీ అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడమేంటి? ఇది కచ్చితంగా రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి యనమల మండిపడ్డారు.

Samayam Telugu 12 Sep 2019, 1:08 pm
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్‌ పర్యటనలో మంత్రి బుగ్గన రాజధాని అమరావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.
Samayam Telugu pjimage (47)


Must Read :ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు విడుదల..

రాజధానిపై మంత్రి వ్యాఖ్యలతో జగన్ సర్కార్ తన వైఖరి స్పష్టం చేసిందని యనమల విమర్శించారు. ప్రపంచ బ్యంకు, ఏసియన్ బ్యాంకు రుణాలు పోగొట్టి అమరావతి అభివృద్ధికి నిధులు లేవని చేతులెత్తేయడం సమంజసం కాదన్నారు. ఇది ప్రభుత్వ దివాళాకోరుతునానికి నిదర్శనమని యనమల ఘాటు విమర్శలు చేశారు. రాజధాని విషయంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారని, టీడీపీ హయాంలో చేసింది కూడా అభివృద్ధి వికేంద్రీకరణేనన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలనూ సమానంగా అభివృద్ధి చేశామన్నారు.

Also Read :పల్నాడు పేరుతో చిల్లర వేషాలు.. అందుకేగా.! చంద్రబాబుపై విజయసాయి ఆగ్రహం

రాష్ర్ట ఆర్థిక కార్యకలాపాలను సీఎం వైఎస్ జగన్ చావు దెబ్బ తీశారని యనమల ఆరోపించారు. తన పాలనను మెచ్చుకుంటారని జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని యనమల హెచ్చరించారు. జగన్ ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు. కానీ వంద రోజుల్లో ఇంతకన్నా చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.