యాప్నగరం

'విజయమ్మను ఓడించారని జగన్‌కు విశాఖపై కక్ష'

గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు. పులివెందుల రాజకీయాలను విశాఖలో తీసుకొస్తున్నారని నేతలు ఫైర్.

Samayam Telugu 29 Feb 2020, 12:37 pm
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్ సర్కార్‌పై మండిపడ్డారు.
Samayam Telugu jagan


వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని పోలీసులు ఎందుకు అదుపు చేయలేదని రామయ్య ప్రశ్నించారు. పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఎందుకు తమ విధులు నిర్వర్తించ లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు కుట్ర పన్నారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని.. డీజీపీ దీనిపై స్పందించాలన్నారు. తమ ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారన్నారు.

విజయమ్మను ఓడించారనే జగన్‌కు కక్ష అన్నారు టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారని.. పులివెందుల రాజకీయాలను విశాఖలో తీసుకొస్తున్నారని ఆరోపించారు. జడ్‌ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడమేంటన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.