యాప్నగరం

లోకేష్‌కు షాకిచ్చిన ఇద్దరు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు

పార్టీకి సేవలు అందించినా.. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారట. మరికొందరు నేతలు కూడా డుమ్మా కొట్టారు.

Samayam Telugu 27 Oct 2020, 10:36 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సొంత పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పలువురు నేతలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి పీతల సుజాత ఎక్కడా కనిపించలేదు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆమె అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలు అందించినా.. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారట.. అందుకే పర్యటనకు దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.
Samayam Telugu నారా లోకేష్


ఇటు మరికొందరు నేతలు కూడా అంటీముట్టనట్లు ఉన్నారట. ఉండి మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్‌ కలవపూడి శివ ఎక్కడా కనిపించలేదు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇలా చాలామంది నేతలు లోకేష్ పర్యటనకు దూరంగా ఉండటం పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేతలు కూడా స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.