యాప్నగరం

పసుపుమయమైన ఒంగోలు.. మూడేళ్ల తర్వాత ప్రజల మధ్యలో మహానాడు గర్జన

తెలుగు దేశం పార్టీ అతిపెద్ద వేడుక మహానాడు దాదాపు మూడేళ్ల తర్వాత ప్రజల మధ్యలో ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు విచ్చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 27 May 2022, 11:15 am
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ‘మహానాడు’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీ తన వార్షిక మహానాడు సమావేశాలను ప్రజల మధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఒంగోలు పట్టణమంతా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు.
Samayam Telugu ఒంగోలులో అడుగుపెట్టిన చంద్రబాబునాయుడు


శుక్రవారం ఉదయం 9 గంటలకే మహానాడు ప్రారంభం కాగా, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉదయం 10.30 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఉత్సాహంతో చంద్రబాబుకు జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు.

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభను ప్రారంభించగా.. యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జి ఎరిక్షన్ బాబు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభమైంది. తర్వాత ఒక్కొక్కరిగా నాయకులు ప్రసంగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శుక్రవారం మహానాడు మొదటి రోజున 12 తీర్మానాలను టీటీడీ ప్రవేశపెట్టనుంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.