యాప్నగరం

'వకీల్ సాబ్' దారెటు.. పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే భర్త

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే భర్త. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్. మరింత స్పష్టమైన వైఖరితో పోరాడాల్సిన అవసరం కనబడుతోంది అంటూ పోస్ట్.

Samayam Telugu 22 Sep 2020, 8:40 am
ఏపీలో తాజా పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు అమరావతి విషయంలో జనసేనానిపై ఫేస్‌‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. జనసేనను అడ్డు పెట్టుకుని ఏపీలో బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తోంది అన్నారు. అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి కావాలి అన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
Samayam Telugu పవన్ కళ్యాణ్


Read Also: జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్

‘*"వకీల్ సాబ్"* గారు *"అమరావతికి దారెటు"* అనే విషయంలో ముందు నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు అనడానికి ఈ *రోజున మూడు రాజధానులకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయడమే దానికి అర్ధం*. బహుశా బీజేపీ వారు రాష్ట్రంలో ఏవిధమైన ప్రజాధారణ లేకుండా జనసేనను అడ్డుపెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా ఎదగడానికి జనసేనాను తప్పుదోవ పట్టిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనా జనసేన వారు అమరావతి విషయంలో మరింత స్పష్టమైన వైఖరితో పోరాడాల్సిన అవసరం కనబడుతోంది’అన్నారు శ్రీనివాస్. ఉన్నట్టుండి పవన్‌ను టీడీపీ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: వైసీపీ ఎంపీ ఇంటికి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే.. గుంటూరు జిల్లాలో ఆసక్తికర పరిణామం

Must Read: రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.